రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం | DRI officers seize crystal methamphetamine, cocaine worth 1476 crore | Sakshi
Sakshi News home page

రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

Oct 3 2022 5:08 AM | Updated on Oct 3 2022 5:08 AM

DRI officers seize crystal methamphetamine, cocaine worth 1476 crore - Sakshi

న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నారింజ పండ్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు శనివారం ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. 198 కిలోల స్పటిక మెథాంఫెటామైన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ డ్రగ్స్‌ విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని తెలిపారు.

ముంబైలోని వసీ ప్రాంతంలో అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో నారింజ పండ్ల బాక్సుల్లో భద్రపర్చిన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయని ప్రకటించారు. అక్రమార్కులు దక్షిణాఫ్రికా నుంచి నారింజ పండ్లను దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్‌ అనుమతులు పొందారని అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement