కరోనా ఉధృతి: భారత్లో 2 లక్షలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 2,09,918 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,62,628 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 959 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం 18,31,268 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 15.77% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,03,96,227 మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు.
చదవండిః నిర్మలమ్మా.. వీరి ఆశలన్నీ మీ పైనే!
India reports 2,09,918 new #COVID19 cases, 959 deaths and 2,62,628 recoveries in the last 24 hours
Active case: 18,31,268 (4.43%)
Daily positivity rate: 15.77%Total Vaccination : 1,66,03,96,227 pic.twitter.com/ZTN2OJXQbE
— ANI (@ANI) January 31, 2022