Kolkata: చిదంబరం ఓ బ్రోకర్‌.. సొంతపార్టీ లాయర్ల ఆగ్రహం

Congress Leader P Chidambaram Faced Protest by lawyers at Calcutta - Sakshi

కొల్‌కతా: కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది పి.చిదంబరంకు నిరసన సెగ తగిలింది. కొల్‌కతాలో సొంతపార్టీకి చెందిన లాయర్లు చిదంబరంను అడ్డుకున్నారు. మెట్రో డైరీ అవినీతి కేసు విచారణ కోసం కొల్‌కతా హైకోర్టుకు వచ్చిన చిదంబరంపై కాంగ్రెస్‌ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరం ఓ బ్రోకర్‌ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాగా, మెట్రో డైరీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ బెంగాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం తరపున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సొంతపార్టీకి వ్యతిరేకంగా కేసుకు ఒప్పుకున్న చిదంబరంపై కాంగ్రెస్‌ లాయర్లు మండిపడ్డారు. 

చదవండి: (కస్టడిలో వ్యక్తి మృతి.. రాత్రి సమయంలో విచారణ చేయొద్దు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top