షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బొగ్గుగనిలో పేలుడు సంభవించడంలో 16 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతోన్న సమయంలో సాయంత్రం ఈ పేలుడు జరిగింది. ప్రమాదంలో సమయంలో కూలీలు అందులో చిక్కుకుపోయారు. ప్రమాదం ధాటికి 16 మంది మృతి చెందారు. వారిలో ఎక్కువమంది అస్సాంకు చెందినవారిగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి.
Fresh Visuals From the Site of Coal Mine Tragedy in Meghalaya's East Jaintia Hills, 7 Bodies Recovered#coalminer #coalmining #Meghalaya #coalminetragedy #EastJaintiaHills #northeastlive #northeast #northeastnews pic.twitter.com/EfQuiHAWK3
— Northeast Live (@NELiveTV) February 5, 2026


