న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సీఎస్సీ(Union Public Service Commission Civil Services Examination)-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అనూజ్ అగ్ని హోత్రి మొదటి ర్యాంకు సాధించింది. సివిల్స్ ఫలితాల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ మే 25, 2025న ప్రిలిమ్స్ పరీక్షతో ప్రారంభమై, ఆగస్టు 2025లో జరిగిన మెయిన్స్ పరీక్షల ద్వారా కొనసాగింది. చివరగా ఫిబ్రవరి 27, 2026న ఇంటర్వ్యూలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 979 భర్తీ చేసే స్థానాల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సర్వీసులతో పాటు గ్రూప్-ఏ, గ్రూప్-బీ సర్వీసులు ఉన్నాయి.
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల వివరాలు
- అనూజ్ అగ్నిహోత్రికి మెదటిర్యాంకు
- రాజేశ్వరి సువేకు రెండవ ర్యాంకు
- ఆకాన్ష్ ధుల్ 3వ ర్యాంకు
- రాఘవ్ ఝన్ఝన్ వాలాకు నాలుగవ ర్యాంకు
- ఇషాన్ భట్రాగర్కు 5వ ర్యాంకు
- జినియా అరోరా 6వ ర్యాంకు
- రజా మెుహియుద్దీన్ 7వర్యాంకు
- పక్షల్ సెక్రటరీ 8వ ర్యాంకు
- ఆస్థా జైన్ 9వ ర్యాంకు
- ఉజ్జ్వల్ ప్రియాంక్ 10వ ర్యాంకు
- సృజన 55వ ర్యాంకు
- శ్రీ కృష్ణసాయి 150 ర్యాంకు
- డీఎస్కే ప్రచేత్ 193
- వర్షిత్ రెడ్డి 259 ర్యాంకు
- పవన్ రెడ్డి 297
- హర్షిత 520 ర్యాంకు
- శ్వేత 573 ర్యాంకు
- ప్రమోద్ విష్ణు 640 ర్యాంకు
- విజయ సింహరెడ్డి 682 ర్యాంకు
- పి భార్గవ్ 738 ర్యాంకు
- పి. రాహుల్ 748 ర్యాంకు


