రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తాపడి ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కర్దేగా ఔట్పోస్ట్లోని గొడాంబా దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని కుర్దేగ్ నుండి ఛత్తీస్గఢ్లోని కుంకురి పట్టణానికి ఈ బస్సు వెళ్తోందని జష్పూర్ ఎస్ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు. బస్సు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా పడిందని ఆయన వెల్లడించారు.


