Black Ink was Thrown on Farmer Leader Rakesh Tikait In Karnataka - Sakshi
Sakshi News home page

రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై ఇంక్‌ దాడి.. వాళ్లే పనే అని అనుమానం!

May 30 2022 1:56 PM | Updated on May 30 2022 2:49 PM

Black ink thrown on farmer leader Rakesh Tikait At Karnataka - Sakshi

రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటక బెంగళూరులో ఇంక్‌ దాడి జరిగింది. 

బెంగళూరు: రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రసాభాసా నెలకొంది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. 

టికాయత్‌తోపాటు యుద్విర్‌ సింగ్‌  ముఖంపై నల్లసిరా చల్లింది ఆయన వ్యతిరేక వర్గమని తెలుస్తోంది. అంతేకాదు ఆయనపై కుర్చీలు విసిరారు నిరసనకారులు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
 
కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్‌ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్‌, సింగ్‌లు వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. 

ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇవ్వబోతుండగా.. కొందరు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. దాడికి పాల్పడింది చంద్రశేఖర్‌ మద్ధతుదారులేనని టికాయత్‌ చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement