ప్రకాశ్‌రాజ్‌కు బెదిరింపు లేఖ.. ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’

Actor Prakash Raj And Writer Kum Veerabhadrappa Receives Death Threats - Sakshi

ప్రకాశ్‌రాజ్, సాహితీవేత్తలకు బెదిరింపు లేఖలు

శివాజీనగర/బెంగుళూరు: బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్, సాహితీవేత్త వీరభద్రప్పతో పాటు 16 మంది కర్ణాటక సాహితీవేత్తలకు బెదిరింపు లేఖలు వచ్చాయి. ‘జై హిందూ దేశం, జై సహిష్ణు’పేరుతో వచ్చిన ఈ లేఖల్లో ‘మీపై నేరుగా దాడిచేసి పోలీసులకు లొంగిపోతా’అని ఉంది.  దీనిపై వీరభద్రప్ప, పలువురు రచయితలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు భద్రత పెంచాలని కోరారు. తాను హిందువును కాదని, లింగాయత్‌ను అని వీరభద్రప్ప ఇటీవల ఓ కార్యక్రమంలో ప్రకటించారు.
చదవండి👉🏻 చింతన్‌ శిబిర్‌ వేళ కాంగ్రెస్‌కు షాక్‌.. సీనియర్‌ నేత సునీల్‌ జాఖడ్‌ గుడ్‌బై

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top