Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం | Accident Victim Declared Brain Dead, Organs Donated | Sakshi
Sakshi News home page

Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం

Apr 24 2022 6:53 AM | Updated on Apr 24 2022 6:53 AM

Accident Victim Declared Brain Dead, Organs Donated - Sakshi

బాధితురాలు ప్రీతి మనోజ్‌ (ఫైల్‌)  

బల్లాల్‌బాగ్‌ వద్ద ఆమె స్కూటర్‌ మీద వెళ్తుండగా శ్రావణ్‌కుమార్‌ (30) అనే యువకుడు అవతలి రోడ్డులో బీఎండబ్ల్యూ కారులో వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను దాటి ప్రీతిని ఢీకొన్నాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

యశవంతపుర (బెంగళూరు): మంగళూరు నగరంలో ఈ నెల 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి మనోజ్‌ (47) అనే మహిళ శనివారం బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. ఇంత విషాదంలోనూ ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానం చేయడం గమనార్హం. ఆమె నేత్రాలు, కిడ్నీలు, గుండె, లివర్‌ను మణిపాల్, బెంగళూరు­లోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులకు జీరోట్రాఫిక్‌ మధ్య తరలించారు.

బల్లాల్‌బాగ్‌ వద్ద ఆమె స్కూటర్‌ మీద వెళ్తుండగా శ్రావణ్‌కుమార్‌ (30) అనే యువకుడు అవతలి రోడ్డులో బీఎండబ్ల్యూ కారులో వేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను దాటి ప్రీతిని ఢీకొన్నాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. స్కూటర్, కారు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ దుర్ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయి వైరల్‌గా మారింది. సుమారు రెండువారాల పాటు ఆమె మృత్యువుతో పోరాడింది. తీవ్ర గా­యాలు కావడంతో కోలుకోలేకపోయింది. ఈ నేప­థ్యంలో నిందితుడు శ్రావణ్‌కుమార్‌పై హత్య తదితర నేరాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

చదవండి: (ఏ.. నా కొడుకూ విన్పించుకోడు అన్న యువకుడు.. లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement