ఘోర ప్రమాదం...ఓవర్‌ టెక్‌ చేయబోయి ట్రక్‌ని ఢీ కొట్టిన బస్సు

4 People Killed Bus Truck Collision At Vadodara National Highway - Sakshi

వడోదర: వడోదర కపురై బ్రిడ్జ్‌ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలపాలయ్యారు. నివేదిక ప్రకారం.... లగ్జరీ బస్సు ట్రక్‌ని ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో ట్రక్కుని ఢీ కొట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను వడోదరలోని సాయాజీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్స్సు రాజస్తాన్‌లోని భిల్వారా నుంచి ముంబైకి బయలు దేరుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు. 

(చదవండి: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top