ఘోర ప్రమాదం...ఓవర్ టెక్ చేయబోయి ట్రక్ని ఢీ కొట్టిన బస్సు
వడోదర: వడోదర కపురై బ్రిడ్జ్ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలపాలయ్యారు. నివేదిక ప్రకారం.... లగ్జరీ బస్సు ట్రక్ని ఓవర్టెక్ చేసే క్రమంలో ట్రక్కుని ఢీ కొట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను వడోదరలోని సాయాజీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్స్సు రాజస్తాన్లోని భిల్వారా నుంచి ముంబైకి బయలు దేరుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పేర్కొన్నారు.
#Vadodara
04 died, 15 injured in a collision between a bus and a truck. The bus was going from Bhilwara, #Rajasthan to #Mumbai, collided with the truck while trying to overtake. pic.twitter.com/m7YaHFGJDz— Our Vadodara (@ourvadodara) October 18, 2022
(చదవండి: విమానంలో ప్రయాణికుడి వీరంగం...సిబ్బంది వేలు కొరికి....)