
భూ వివాదాలకు తావుండదు
మక్తల్: ఏ గ్రామంలోనూ భూ వివాదాలు ఉండకూడదనే లక్ష్యంతో భూ భారతి చట్టాన్ని రూపకల్పన చేశారని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి చట్టం – 2025పై రైతులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన భూ భారతిపై ప్రజలకు అవగహన కల్పించాలని, ఈమేరకు రెవెన్యూ యంత్రం కృషి చేయాలన్నారు. వివాద రహిత భూవిధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని, భవిష్యత్లో భూమికి సంబందించిన సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో భూదార్ తీసుకొస్తామని అన్నారు. రాష్ట్రంలో 10,954 గ్రామపాలన అధికారులను నియమించబోతున్నామని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీస్కుమార్, లక్ష్మారెడ్డి, గణేస్కుమార్ తదితరులు పాల్గొన్నారు.