డి.కొట్టాల, శ్రీరంగాపురం, ఎల్లావత్తులతో పాటు చుట్ట పక్కల గ్రామాల ప్రజల తాగు నీటి అవసరాల కోసం, పశువుల దాహం తీర్చడానికి పూర్వం సుబ్బ య్య అనే దాత డి. కొట్టాల సమీపంలో 226/1, 226/2, 226/3 సర్వే నంబర్ల పరిధిలోని కుంట నిర్మాణానికి 7.54 ఎకరాల పొలాన్ని విరాళంగా ఇచ్చారు. చుట్టూ పెద్ద కట్టలు పోయించి కుంటగా తయారు చేయించినట్లుగా గ్రామస్తులు తెలుపుతున్నారు. సమాజ శ్రేయస్సు కోసం దాత నిర్మించిన కుంట నేడు ఆక్రమణకు గురైంది. కుంటలో నీరు నిల్వ ఉంటే చుట్టు పక్కల వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు పెరుగుతాయని భావించిన కొంద రు గ్రామస్తులు స్వచ్ఛందంగా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు పరిధిలో ఉన్న విషయం తెలిసి కూడా అధికార పార్టీ నేతలు భారీ నిర్మాణాలు చేపట్టడం తీ వ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు సైతం కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందని తెలిసి కూడా అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్నారు.


