పైళ్లెన నాలుగు నెలలకే.. | - | Sakshi
Sakshi News home page

పైళ్లెన నాలుగు నెలలకే..

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఆదోని అర్బన్‌: పట్టణ శివారులోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌లోని పర్వతాపురం క్రాస్‌ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని బుడుదూ రు గ్రామానికి చెందిన సోమశేఖర్‌, శాంతమ్మ(21)కు నాలుగు నెలల క్రితం వివాహమైంది. శ్రావణ మాసం కావడంతో బైక్‌పై బాబాయి కొడుకు ఆకాష్‌తో కలసి ఉరుకుంద క్షేత్రానికి బయలుదేరారు. ఆదోని పట్టణ సమీపంలోని ఆలూరు–సిరుగుప్ప బైపాస్‌లోని పర్వతాపురం క్రాస్‌ వద్ద స్పీడు బ్రేకర్‌ను గమనించకుండా వేగంగా వెళ్లడంతో వెనుక కూర్చున్న శాంతమ్మ(21) ఎగిరి కింద పడటంతో తీవ్రంగా గాయపడింది. ఆ క్రమంలో బైక్‌ అదుపు తప్పి కింద పడటంతో బాలుడు ఆకాష్‌కు గాయాలయ్యాయి. వెంటనే ఇద్దరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి శాంతమ్మ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement