కరువు ఉరమడంతో రైతు కష్టం మట్టిలో కలిసిపోతుంది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలను కాపాడుకోలేక దున్నేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఎల్నినో దెబ్బకు వరుణుడు జాడ లేకపోవడంతో పంటలు బెట్టపోవడంతో రైతులు ఆశలు వదులుకుని చెరిపేస్తున్నారు. పెట్టుబడితో పాటు రైతుల రెక్కల కష్టం మట్టిపాలవుతోంది. చాకరాజువేముల గ్రామానికి చెందిన మిన్నల్ల అనే కౌలు రైతు 25 ఎకరాలు మినుము సాగు చేశాడు. ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడులు వెచ్చించాడు. కానీ పంట ఎండుముఖం పట్టడంతో ప్రత్యామ్నాయ పంట చేసుకునే క్రమంలో మినుమును ట్రాక్టర్తో దున్నేశాడు – దొర్నిపాడు


