అటవీ భూముల్లో మట్టి మాఫియా! | - | Sakshi
Sakshi News home page

అటవీ భూముల్లో మట్టి మాఫియా!

Dec 25 2025 10:15 AM | Updated on Dec 25 2025 10:15 AM

అటవీ భూముల్లో మట్టి మాఫియా!

అటవీ భూముల్లో మట్టి మాఫియా!

వందలాది టిప్పర్లతో మట్టి రవాణా

పట్టించుకోని అధికారులు

బండిఆత్మకూరు: టీడీపీ నాయకులు మట్టి సైతం వదలడం లేదు. అక్రమార్జనకు అటవీ భూముల్లో సైతం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు, కడమలకాలువ గ్రామ శివార్లలోని తెలుగుగంగ ప్రధాన కాలువ వెంట ఉన్న అటవీ, సొసైటీ భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఇటుక తయారీకి సరిపడే ఎరమ్రట్టి ఉంది. ఈ మట్టిని కొల్లాగొట్టాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు ఇటీవలే దందా మొదలు పెట్టారు. ఆయా గ్రామాల్లో ఉండే దళారులతో పేదలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించారు. పేదలకు మాయమాటలు చెప్పి అక్రమ తవ్వకాలు జరపుతున్నారు. వందలాది ట్రిప్పుర్లతో రవాణా చేస్తున్నారు. ఈ వ్యవహారం అటవీ భూముల్లోనే కాకుండా తెలుగు గంగ ప్రధాన కాలువ వెంట కూడా సాగుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి తెలుగుగంగ ప్రధాన కాలువపై ప్రొక్లెయిన్‌ను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement