ఆధ్యాత్మికతతో మానసిక ఒత్తిడి దూరం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికతతో మానసిక ఒత్తిడి దూరం

Nov 17 2025 10:25 AM | Updated on Nov 17 2025 10:25 AM

ఆధ్యాత్మికతతో మానసిక ఒత్తిడి దూరం

ఆధ్యాత్మికతతో మానసిక ఒత్తిడి దూరం

నంద్యాల(వ్యవసాయం): యాంత్రిక జీవనంలో ఉండే అధికారులు ఆధ్యాత్మిక త చింతనతో ఒత్తిడి దూ రమై మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చని జిల్లా ప్రిన్సిపాల్‌ జడ్జి కబర్ది అన్నారు. జిల్లాలోని పలువురు జడ్జీలు ఆదివారం నవనందుల యాత్ర చేపట్టారు. మొదట ప్రథమనందీశ్వరుడిని దర్శించుకుని అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. వారికి ఆల య ఈఓ ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం వారు అన్నదాన కార్యక్రమాల్లో పాలొన్నారు. ఆలయ నిర్వాహకులు జడ్జీలను శాలువాలతో సత్కరించి స్వామి వారి ప్రతిమలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్జిలు కమలాదేవి, అమ్మన్నరాజా, శ్రీవిద్య, రాజేంద్రబాబు, దివాకర్‌, శ్రీనివాసులు, కర్రి లక్ష్మి, నీలవెంకటశేషాద్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement