మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్లో 77వ ఎన్సీసీ దినోత్సవం ‘విశాఖ తరంగ్’ పేరుతో ఘనంగా జరిగింది. కార్యక్రమాన్ని శౌర్యం, ధర్మం, సాంస్కృతిక వైభవాల సంగమంగా నిర్వహించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని, విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సమయంలో ఎన్సీసీ దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్ మాట్లాడుతూ ఎన్సీసీ దేశ ఐక్యతకు ప్రతిబింబమని, మంచి నడవడికను నేర్పుతుందన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న ఎన్సీసీ క్యాడెట్లకు ఉపకులపతి, వైస్ అడ్మిరల్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో కమడోర్ గ్రూప్ కమాండర్ సుమంత్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.


