రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత | - | Sakshi
Sakshi News home page

రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత

Nov 12 2025 7:16 AM | Updated on Nov 12 2025 7:16 AM

రానున్న రోజుల్లో  పెరగనున్న చలి తీవ్రత

రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత

రానున్న రోజుల్లో పెరగనున్న చలి తీవ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): రానున్న రోజుల్లో ఉమ్మడి జిల్లాలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వర్షసూచన లేదని వ్యవసాయ వాతావరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త జి.నారాయణ స్వామి తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. ఇందువల్ల ఇటు కర్నూలు, అటు నంద్యాల జిల్లాలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 32.2 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 18.5 నుంచి 20 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 74–80 శాతం వరకు ఉండటం వల్ల చలి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement