నిడమనూరు : నిడమనూరు పీఏసీఎస్కు శనివారం 445 బస్తాలు (18 టన్నులు) యూరియా వచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో యూరియా కోసం రైతులు సహకార సంఘం వద్దకు వచ్చారు. దీంతో ఎస్ఐ ఉప్పు సరేష్ ఆధ్వర్యంలో పోలీస్ పహారా నడుమ.. ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున 148 మంది రైతులకు యూరియా పంపిణీ చేశారు. సగంమంది రైతులు యూరియా తీసుకోకుండానే వెనుదిరాగారు. గతేడాది ఏడాది సహకార సంఘం ద్వారా 1100 టన్నుల యూరియా విక్రయించగా, ఈ ఏడాది 400 టన్నులే విక్రయించామని సీఈవో జానయ్య వెల్లడించారు. సోమవారం మరో రెండు లారీల యూరియా వస్తుందని ఏఈఒ విజయచంద్ర తెలిపారు.