భూదాన్పోచంపల్లి: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్సిలిండర్ నుంచి మంటలు అంటుకొని తీవ్రంగా గాయపడి ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు సుజయ్ ధర్మాని(55), నాగేంద్రనాథ్ మండల్(50) ఆదివారం మృతిచెందారు. ఎస్ఐ విక్రమ్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామానికి చెందిన శెట్టి సురేశ్ మూసీ పరీవాహక గ్రామాల్లో వరినాట్లు వేయించేందుకు ఈ నెల 13న ఉదయం పశ్చిమబెంగాల్కు చెందిన 10 మంది వలస కూలీలను రప్పించాడు.మున్సిపాలిటీ పరిధిలోని రేవనపల్లిలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలలో వారికి ఆశ్రయం కల్పించాడు. వారు మధ్యాహ్నం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్పైప్కు మంటలు అంటుకొని పైప్ కాలిపోయింది. దాంతో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా ఆరుగురు గాయపడ్డారు. వీరందరినీ చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా సుజయ్ ధర్మాని, నాగేంద్రనాథ్ మండల్ మృతిచెందారు. మిగతా నలుగురు చికిత్ప పొందుతున్నారని, వారికి ప్రాణాపాయం ఏమిలేదని ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్నామని పేర్కొన్నారు.
Breadcrumb
- HOME
చికిత్స పొందుతున్న ఇద్దరు వలస కార్మికులు మృతి
Published Mon, Dec 18 2023 1:32 AM
Related news by tags
-
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్ని..
తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.చిత్రంలోని ఈ డెడ్ స్కిన్ రిమూవర్లో.. 2 లెవెల్స్లో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డివైస్తో పాటుగా రీప్లేసబుల్ గ్రైండింగ్ హెడ్స్ లభిస్తాయి. వాటిలో 2 స్క్రబ్ హెడ్స్తో పాటు.. ఒక రోలర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్తో పోర్టబుల్ డివైస్గా ఉన్న ఈ రోలర్.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.హ్యాండిల్తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మేకప్ రిమూవర్ ఫుట్ స్క్రబ్ డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్.. హై హీల్స్ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్ స్పా బ్యూటీ రోలర్ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్గానూ ఇవ్వచ్చు.ఇవి చదవండి: ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో.. -
2019 ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకూ నిజమయ్యాయి? యూపీలో ఏం జరిగింది?
ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఈరోజుతో ముగియనున్నాయి. ఆ తర్వాత అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.పలు ఏజెన్సీలు తమ అధ్యయనాల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేస్తాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకూ నిజమయ్యాయో ఇప్పుడు చూద్దాం. 2019 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని స్పష్టంగా వెల్లడయ్యింది. ఫలితాల్లో కూడా అదే జరిగింది. 2019లో మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 352 సీట్లు దక్కించుకుంది. ఒక్క బీజేపీనే రికార్డు స్థాయిలో 303 సీట్లు దక్కించుకుంది.2019 లోక్సభ ఎన్నికల్లో యూపీఏ 90 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లోని 80 సీట్లకు గాను ఎన్డీఏ 49 సీట్లను గెలుచుకుంటుందనే అంచనాలు ఎగ్జిట్ పోల్స్లో వెలువడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 సీట్లు గెలుచుకుంది. రాయ్బరేలీ సీటు ఎస్పీకి దక్కింది. 10 సీట్లు బీఎస్పీ, కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.ఎగ్జిట్ పోల్స్లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్డీలకు 29 సీట్లు వస్తాయని అంచనాలున్నాయి. ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్కు కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 73 స్థానాలను గెలుచుకుంది. వాటిలో 71 బీజేపీకి, రెండు అప్నాదళ్కు దక్కాయి. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్ఎల్ఏడీ కలిసి పోటీ చేశాయి. యూపీలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది. -
మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్తో పాటు బిహార్, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది.హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. తాజాగా ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ ప్రజలు అందరూ తమ ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ వేవ్ ఉందని ఆమె అన్నారు. మండీ ప్రజలు తప్పకుండా తనను గెలిపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న 4 ఎంపీ స్థానాల్లో బీజేపీనే గెలిపిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. మండిలో బలమైన అభ్యర్థితో కంగనా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్తో ఆమె పోటీ పడుతున్నారు. రాజకుటుంబంలో జన్మించిన విక్రమాదిత్య కూడా ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు.#WATCH | Himachal Pradesh: BJP candidate from Mandi Lok Sabha, Kangana Ranaut says "I have cast my vote right now. I want to appeal to the people to take part in the festival of democracy and exercise their right to vote. PM Modi's wave is there in Himachal Pradesh...I am hopeful… pic.twitter.com/aBv0zVNyFM— ANI (@ANI) June 1, 2024 -
నేటి ఫైనల్ రౌండ్ ఛాంపియన్ ఎవరు? 2019లో ఏం జరిగింది?
2024 లోక్సభ ఎన్నికల ప్రయాణం నేటితో ముగింపు దశకు చేరుకోనుంది. నేడు (శనివారం,జూన్ 1) జరిగే ఏడో దశ పోలింగ్లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు స్థానం వారణాసిలో కూడా ఓటింగ్ జరగనుంది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్, నటి కంగనా రనౌత్, భోజ్పురి నటుడు రవి కిషన్, భోజ్పురి సింగర్ పవన్ సింగ్, కాజల్ నిషాద్ తదితరులు నేడు జరిగే పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.2019లో ఈ 57 సీట్లలో బీజేపీ అత్యధికంగా 25 సీట్లు గెలుచుకుంది. టీఎంసీకి 9, బీజేడీకి 4, జేడీయూ, అప్నాదళ్ (ఎస్)కు చెరో రెండు సీట్లు చొప్పున వచ్చాయి. జేఎంఎం కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పంజాబ్లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు గెలుచుకుంది.2024 లోక్సభ ఎన్నికల ఏడవ దశలో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధికంగా 56 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ 51 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 31 మంది అభ్యర్థులను రంగంలోకి దించింది. టీఎంసీ తొమ్మది మంది అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది. సమాజ్వాదీ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఎం ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. అకాలీదళ్ 13 మంది అభ్యర్థులను ఎన్నికల రంగంలోకి దింపింది. పంజాబ్లోని మొత్తం 13 స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. బిజూ జనతాదళ్ ఆరుగురు అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఐ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దించింది.2019 ఎన్నికల్లో మొదటి దశలో 70 శాతం ఓటింగ్ జరిగింది. 2024 మొదటి దశలో ఓటింగ్ శాతం 66.1గా ఉంది. 2019 రెండవ దశలో 70.1శాతం ఓటింగ్ నమోదైంది. 2024 రెండవ దశలో 66.7 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 మూడవ దశలో ఓటింగ్ శాతం 66.9శాతం. 2024 మూడో దశలో 65.7 శాతం ఓటింగ్ జరిగింది. 2019 నాలుగో దశలో 69.1 శాతం ఓటింగ్ జరగగా, 2024 నాలుగో దశలో 69.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఐదో దశలో 62 శాతం ఓట్లు పోలయ్యాయి. 2024 ఐదవ దశలో 62.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఆరవ దశలో 64.2 శాతం ఓటింగ్ జరిగింది. 2024 ఆరవ దశ ఎన్నికలలో 63.4 శాతం ఓటింగ్ జరిగింది. -
Lok Sabha Election 2024: మూడు సీట్లు... ముచ్చెమటలు!
సార్వత్రిక ఎన్నికల జాతర చివరి అంకానికొచ్చింది. జార్ఖండ్లో 14 లోక్సభ స్థానాలకు గాను 11 చోట్ల పోలింగ్ ముగిసింది. మిగతా మూడింటికి నేడు ఏడో విడతలో పోలింగ్కు రంగం సిద్ధమైంది. ప్రధాని మోదీతో సహా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు. ఈ మూడు సీట్లలో రెండు ఎస్టీ నియోజకవర్గాలు. వీటిలో 2 బీజేపీ, ఒకటి జేఎంఎం ఖాతాలో ఉన్నాయి. ఈ స్థానాలపై ఫోకస్...గొడ్డా.. బీజేపీ అడ్డా ఇది కమలనాథుల కంచుకోట. 1991లో మాత్రం జేఎంఎం నుంచి సూరజ్ మండల్ విజయం సాధించారు. కేంద్రంలో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటేసేందుకు జేఎంఎం ఎంపీలు ముడుపులు తీసుకున్న వివాదంలో సూరజ్ మండల్ పేరు మార్మోగింది. కాంగ్రెస్ కూడా ఒక్క 2004లో మాత్రమే గెలిచింది. గత మూడు ఎన్నికల్లోనూ బీజేపీదే విజయం. హ్యాట్రిక్ కొట్టిన ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4.5 లక్షల ఓట్లు సాధించిన జార్ఖండ్ వికాశ్ మోర్చా (ప్రజాతాంత్రిక్) నేత ప్రదీప్ యాదవ్ కాంగ్రెస్లో చేరి పోటీ చేస్తున్నారు. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో 3 కాంగ్రెస్, 2 బీజేపీ, ఒకటి జేఎంఎం చేతిలో ఉన్నాయి. ఈసారి బీజేపీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ఇండియా కూటమి గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. దుమ్కా... సోరెన్ ఫ్యామిలీ వార్ఈ ఎస్టీ రిజర్వుడ్ స్థానం జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్ శిబు సోరెన్ కంచుకోట. ఆయన 1980లో జేఎంఎం తరఫున ఇక్కడ తొలిసారి పాగా వేశారు. 1989 నుంచి మూడుసార్లు గెలిచినా, తర్వాత రెండు సార్లు బీజేపీ నేత బాబూలాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. మళ్లీ వరుసగా నాలుగు ఎన్నికల్లోనూ సోరెన్దే హవా. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నళిన్ సోరెన్ ఈసారి జేఎంఎం తరఫున బరిలోకి దిగారు. బీజేపీ కూడా సిట్టింగ్ ఎంపీని కాదని శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్కు టికెటిచి్చంది. ఆమె సోరెన్ పెద్ద కుమారుడు దివంగత దుర్గా సోరెన్ భార్య. మామ కంచుకోటలో కోడలే జేఎంఎంకు సవాలు విసురుతుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. దుమ్కాలో 40 శాతం గిరిజనులు, 40 శాతం వెనకబడిన వర్గాలు, 20 శాతం ముస్లింలు ఉంటారు. ఈ లోక్సభ స్థానం పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 జేఎంఎం, 2 బీజేపీ, ఒకటి కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. రాజ్మహల్... హోరాహోరీ ఈ స్థానంపై కాంగ్రెస్ క్రమంగా పట్టు కోల్పోయింది. 1989లో తొలిసారి జేఎంఎం నెగ్గింది. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ, జేఎంఎం మధ్య చేతులు మారుతూ వస్తోంది. గత రెండు ఎన్నికల్లోనూ విజయం జేఎంఎంనే వరిచింది. 2019లో విజయ్కుమార్ హన్స్డా లక్ష ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి హేమ్లాల్ ముర్ముపై వరుసగా రెండోసారి గెలిచారు. ఈసారి హ్యాట్రిక్పై గురిపెట్టారు. బీజేపీ ఈసారి రాజ్మహల్ లోక్సభ స్థానం పరిధిలోని బోరియో సిట్టింగ్ ఎమ్మెల్యే తాలా మరాండీని రంగంలోకి దించింది. సీపీఎం నుంచి గోపెన్ సోరెన్ కూడా తలపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Related News by category
-
రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సనత్నగర్ (హైదరాబాద్): తెలంగాణను ఏవియేషన్ హబ్గా మారుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2024ను ఆయన సందర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని కోరారు. అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, గ్లోబల్ ఏవియేషన్ సమిట్ను నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం హైదరాబాద్లో ఉందన్నారు. ప్రపంచంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా ఎంపికైందని చెప్పారు. అమృత్కాల్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడం, కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, మహబూబ్నగర్ జిల్లా అడక్కల్ మండలం గుడిబండ గ్రామంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. తొలి దశలో ఇప్పటికే వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఆరు విమానాశ్రయాల సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్లో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. ఇదే కాకుండా మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయన్నారు. తయారీ సేవలు, ఇంజనీరింగ్, శిక్షణతోపాటు అనుబంధ సంస్థలకు అతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. లోహ విహంగాల సందడి ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2024 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు రన్వేపై కొలువుదీరాయి. వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్తోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు ఆసక్తి కనబర్చారు. బోయింగ్ 777, ఎయిర్ ఇండియాతోపాటు ఆకాశ ఎయిర్ 737–8లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సనత్నగర్ (హైదరాబాద్): తెలంగాణను ఏవియేషన్ హబ్గా మారుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2024ను ఆయన సందర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని కోరారు. అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, గ్లోబల్ ఏవియేషన్ సమిట్ను నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం హైదరాబాద్లో ఉందన్నారు. ప్రపంచంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా ఎంపికైందని చెప్పారు. అమృత్కాల్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడం, కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి, మహబూబ్నగర్ జిల్లా అడక్కల్ మండలం గుడిబండ గ్రామంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా బసంత్నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. తొలి దశలో ఇప్పటికే వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఆరు విమానాశ్రయాల సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్లో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. ఇదే కాకుండా మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయన్నారు. తయారీ సేవలు, ఇంజనీరింగ్, శిక్షణతోపాటు అనుబంధ సంస్థలకు అతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. లోహ విహంగాల సందడి ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2024 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు రన్వేపై కొలువుదీరాయి. వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్తోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు ఆసక్తి కనబర్చారు. బోయింగ్ 777, ఎయిర్ ఇండియాతోపాటు ఆకాశ ఎయిర్ 737–8లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
రెండ్రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం మొట్టమొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, అసలు ఆట ఇప్పుడుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పగించారనే పాత చింతకాయ పచ్చడినే శుక్రవారం జరిగే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ నోటితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై గతంలో కాంగ్రెస్ హయాంలో ఏనాడూ చర్చ జరగలేదని, తాము మాత్రం పద్దులపై ప్రతీ ఏటా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కాగ్ నివేదికలను ఇచ్చామన్నారు. ప్రతీ ఏడాది తమ ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం లాంటిదేనని, ప్రతీ అసెంబ్లీ సమావేశంలో అప్పుల వివరాలు సమర్పించామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ నేతలు చదవకపోతే ఏం చేస్తామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి. పాలకుర్తిలోనూ నిరుద్యోగం ఉండటమేంటి, ఉద్యోగాల మేళా పెడతాం అని అక్కడి ఎమ్మెల్యే అంటున్నారు.. వేచి చూద్దాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రెండ్రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం మొట్టమొదటి మంత్రివర్గం సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టిందని, అసలు ఆట ఇప్పుడుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి అప్పగించారనే పాత చింతకాయ పచ్చడినే శుక్రవారం జరిగే అసెంబ్లీ ఉభయ సభల సమావేశాల్లో గవర్నర్ నోటితో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై గతంలో కాంగ్రెస్ హయాంలో ఏనాడూ చర్చ జరగలేదని, తాము మాత్రం పద్దులపై ప్రతీ ఏటా శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కాగ్ నివేదికలను ఇచ్చామన్నారు. ప్రతీ ఏడాది తమ ప్రభుత్వం ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ శ్వేతపత్రం లాంటిదేనని, ప్రతీ అసెంబ్లీ సమావేశంలో అప్పుల వివరాలు సమర్పించామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి ఇచ్చిన నివేదికను కాంగ్రెస్ నేతలు చదవకపోతే ఏం చేస్తామన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని పరోక్షంగా ఉద్దేశిస్తూ ‘ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఇలాంటి హామీలు అనేకం ఉన్నాయి. పాలకుర్తిలోనూ నిరుద్యోగం ఉండటమేంటి, ఉద్యోగాల మేళా పెడతాం అని అక్కడి ఎమ్మెల్యే అంటున్నారు.. వేచి చూద్దాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి కొనసాగింపు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డిని కొనసాగించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం. కాగా అందుకు ఆయన అంగీకరించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. గతంలో బండి సంజయ్ స్థానంలో నియమించినప్పుడే.. శాసనసభ ఎన్నికల దాకే ఆ బాధ్యతలు నిర్వహిస్తానని కిషన్రెడ్డి నాయకత్వానికి చెప్పారని, అదీగాక ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించక పోవడంతో తనను బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరారని తెలిసింది. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి పూర్తి సమయం కేటాయించాలని కిషన్రెడ్డి భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు ముగిసేదాకా కొనసాగాలని నాయకత్వం ఆయనకు నచ్చజెప్పినట్టు సమాచారం. దీంతో పార్లమెంటు ఎన్నికల దాకా కొనసాగేందుకు ఆయన ఒప్పుకున్నట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో 3, 4 నెలల్లోనే ఈ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండడంతో.. ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధ్యక్షుడు కుదురుకోవడం సాధ్యం కాదని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కీలకమైన ఎన్నికలు కావడంతో పాటు తెలంగాణ నుంచి అధిక సీట్లు (గతంలో గెలిచిన 4 సీట్ల కంటే ఎక్కువగా) గెలిచేందుకు అవకాశం ఉందన్న అంచనాల మధ్య కిషన్రెడ్డినే కొనసాగించాలని భావించినట్టు సమాచారం.
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అంజన్న నామస్మరణతో మార్మోగిన బీచుపల్లి
విధులు పకడ్బందీగా నిర్వహించాలి
ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
మృతులందరిది ఒకే కుటుంబం
అప్పులబాధతో ఆర్ఎంపీ బలవన్మరణం
ఫెడరేషన్ క్రీడల్లో వనజారెడ్డికి బంగారు పతకాలు
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యేలు
ఉత్సాహంగా సర్కారి కిస్తీ
మేమంటే.. మేమే..
Photos
View allVideo
View allతప్పక చదవండి
- ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ
- lok sabha exit poll 2024: మార్కెట్లకు ఫలితాల జోష్!
- పాక్లో బ్రిగేడియర్గా తొలిసారి... మైనారిటీ మహిళ
- సందేశ్ఖాలిలో మళ్లీ హింస
- భేటీలతో మోదీ బిజీ బిజీ
- రుచిగా ఉంటే తినేయడమే!
- విదేశాలకే వి‘హారం’
- రిటైర్మెంట్ ఫండ్స్తో ఆర్థిక ప్రణాళిక ఇలా..
- వాతావరణ మార్పులతో ‘బ్రెయిన్ స్ట్రోక్’
- జీవిత బీమా ఐపీవోపై కన్ను
Advertisement