జాతర మైదానంలోని విద్యుత్ సబ్స్టేషన్ నుంచి గుట్టపై ఉన్న ప్రధాన ఆలయం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 20 పిల్లర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 10 పిల్లర్లకు ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. పిల్లర్ల నిర్మాణానికి కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. అమ్మాపురం సమీపం నుంచి కురుమూర్తి గుట్ట వెనుక భాగం మీదుగా ప్రధాన ఆలయం వరకు చేపడుతున్న ఘాట్రోడ్డు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రహదారిని చదును చేసి కంకర పరచారు. బీటీ వేసేందుకు సిద్ధం చేస్తున్నారు.


