మా పొలంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఇసుక తవ్వి ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. ఈ విషయాన్ని అడిగితే నాపైనే తిరిగి దాడి చేశారు. నా పొలంలో ఇసుక తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
– ఈశ్వరయ్య, అంబట్పల్లి గ్రామం, లింగాల మండలం
చర్యలు తీసుకోండి
మా గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు మాపై దాడి చేస్తున్నారు. నా భర్త చాలా ఏళ్ల కిందట మరణించగా.. కూతురు నాసు చిట్టెమ్మ (అంధురాలు) మాత్రమే ఉంటున్నాం. వారు రాత్రి సమయంలో మా ఇంటిపై రాళ్లు వేస్తూ, తలుపులు కొడుతూ.. దూషిస్తూ ఇబ్బందులకు గురుచేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని కఠినంగా శిక్షించి.. మాకు రక్షణ కల్పించాలి.
– నాసు లక్ష్మమ్మ, పోతిరెడ్డిపల్లి, వంగూర్ మండలం


