జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో గల ఓ కొర్పొరేట్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ టారిఫ్ రేట్లను కాదని రోగుల వద్ద అదనపు వసూలు చేస్తున్న ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఉన్నాతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. – కేతేపల్లి శంకర్,
పెద్దముద్దునూర్, నాగర్కర్నూల్ మండలం
ఆ భూములు తొలగించాలి..
ఉప్పునుంతల మండలం విఘ్నేశ్పూర్ శివారులో 140 మందికి సంబంధించి 136 ఎకరాలు నిషేధిత 22ఏలో చూపించారని వీటిని తొలగించాలని గ్రామ స్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ భూమిని తాము చాలా సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుచేస్తున్నామని పేర్కొన్నారు. –విఘ్నేశ్పూర్ గ్రామస్తులం, ఉప్పునుంతల మండలం


