బల్మూర్: బల్మూరు శివారులో నిర్మించబోయే ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సోమవారం సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ తక్షణమే డిజైన్ మార్పు చేసి రైతులను ఆదుకోకపోతే బాధిత రైతులను సమీకరించి ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, రైతులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేష్, నాగరాజు, లాల్ అహ్మద్, బాబర్, శ్రీరామ్, శ్రావణ్కుమార్, కృష్ణయ్య, అంజి, బాలరాజు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.


