అమరచింత: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలను ఉపాధి పనులకు తీసుకెళ్లి గ్రామాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న వీబీజీ రాంజీ పథకం తాత్కాలిక ఉద్యోగులు డిమాండ్ల సాధనకు పెన్డౌన్–షట్డౌన్ కార్యక్రమంతో ఈ నెల 27 నుంచి సమ్మెబాట పట్టారు. దీంతో ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన వన మహోత్సవ కార్యక్రమానికి ఆటంకాలు ఎదురైనట్లు అయింది. 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ప్రభుత్వం నేటికీ క్రమబద్ధీకరించకపోవడం, పనికి తగిన వేతనం చెల్లించకపోవడం తదితర సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులు వీబీజీ రాంజీ పథకం అమలైనా.. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళనబాట పట్టారు. ఈ నెల 27 నుంచి ఆగస్టు 4 వరకు వివిధ రకాల ఆందోళనతో తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకొని రోజువారీ కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఈ నెల 27న ఎంపీడీఓలు, డీఆర్డీఓ, కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించి ఆందోళనకు దిగిన తాత్కాలిక ఉద్యోగులు తమ హక్కుల సాధనకు విడతల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. మండలస్థాయిలో కేవలం కార్యాలయానికి మాత్రమే పరిమితమవుతూ పెన్డౌన్.. షట్డౌన్ చేస్తున్నారు.
వీబీజీ రాంజీ తాత్కాలిక ఉద్యోగుల పెన్డౌన్.. షట్డౌన్
కార్యాలయాలకే పరిమితమైన సిబ్బంది
ముందుకుసాగని వన మహోత్సవం
ఆగస్టు 15 నాటికి సమస్యలుపరిష్కరించాలని డిమాండ్
ఉమ్మడి జిల్లాలో 653 మంది ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులుగాగుర్తించాలి..
సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసులో భాగంగా వీబీజీ రాంజీ పథకంలో 20 ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగుతున్నాం. సరైన సమయానికి వేతనం రాదు.. పనికి తగిన వేతనం చెల్లించడం లేదు. అయినా ఎప్పటికై నా క్రమబద్ధీకరిస్తారనే ఆలోచనతో విధులు నిర్వర్తిస్తున్నా నేటికీ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇక చేసేది లేక హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టడం తప్పడం లేదు.
– బాలయ్య, జిల్లా అధ్యక్షుడు, వీబీజీ రాంజీ తాత్కాలిక ఉద్యోగుల సంఘం
ఉన్నతాధికారులకు విన్నవించాం..
రాష్ట్ర స్థాయిలో ఉద్యోగుల ఆందోళన ఉండటంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకేళుతున్నాం. ప్రస్తుతం కొత్తగా ఇంచార్జి తీసుకోవడం ద్వార పూర్తి స్థాయిలో ఉద్యమం గురించి తెలుసుకోని, గ్రామీణ ప్రాంతాలలో వీబీజీ రాంజీ పనులు కొనసాగేలా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలతో ముందుకు వెలుతాం.
– రాంమహేశ్వరరావు, ఇన్చార్జి డీఆర్డీఓ


