వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని వనదేవతలను నూతన సంవత్సరం గురువారం రోజు భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి తరలివచ్చారు. స్నానఘట్టాల వద్ద షవర్ల కింద జల్లు స్నానాలు ఆచరించారు. అనంతరం గద్దెల వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, చీరసారె, ఒడిబియ్యం, ఎత్తు బంగారం సమర్పించారు. నూతన సంవత్సరమంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవార్లకు పూజలు నిర్వహించినట్లు తెలిపారు. పూజారుల చేతుల మీదుగా నుదట బొట్టు పెట్టించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.


