నిర్వహణ భారం
40 నెలలుగా పెండింగ్ బిల్లులు
40 నెలలుగా రైతు వేదికలకు అందని నిధులు
ములుగు రూరల్: రైతులకు లాభసాటి వ్యవసాయం, పంటలను ఆశించే చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలను ఏర్పాటు చేసింది. రైతువేదికల నిర్మాణాలతో రైతులతో వ్యవసాయశాఖ అధికారులు అనుసందానంగా ఉండేందుకు వీలుగా ఉంటుంది. రైతు వేదికలకు గతకొన్ని నెలలుగా నిర్వహణ నిధులు ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వం ఆగస్టు –2022 వరకు రైతు వేదికల నిర్వహణకు నిధులు మంజూరు చేసింది. 40 నెలలుగా రైతు వేదికల నిర్వహణకు నిధులు మంజూరు చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారింది.
రైతు వేదికల నిర్వహణ వివరాలు
జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 31 క్లస్టర్లుగా విభజించారు. వీటిల్లో 31 రైతు వేదికలను నిర్మించి 31 మంది ఏఈఓలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతు వేదికకు రూ. 9 వేలను మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతు వేదికల్లో తాగునీరు రూ.500, పారిశుద్ధ్యం రూ.3 వేలు, స్టేషనరీ రూ.1,000, కరెంట్ బిల్లు రూ.1,000, మైనర్ రిపేర్లు రూ.1,000, నెలలో 8 సార్లు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది. ఒక్కో రైతు వేదికకు ప్రభుత్వం నెలకు రూ.2.79 లక్షల నిధులను మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల నిర్వహణకు సొంత డబ్బు ఖర్చు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
రైతు వేదికల నిర్వహణకు నిధులు రావడం లేదనే విషయం వాస్తవమే. సెప్టెంబర్ –2022 నుంచి ఇప్పటి వరకు సుమారు 40 నెలలుగా రైతు వేదికల నిర్వహణ నిధులు మంజూరు కాలేదు. రైతు వేదికల నిర్వహణలో కరెంటు బిల్లుల చెల్లింపు, పారిశుద్ధ్యం, సమావేశాల నిర్వహణ కష్టతరంగా మారుతుంది. ప్రభుత్వం నిధులను ఎప్పుడు మంజూరు చేస్తుందో చూడాలి.
– సురేశ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●
జిల్లాలో 31 క్లస్టర్లలో రైతు వేదికల నిర్వహణ కొనసాగుతోంది. ప్రతినెలా ఒక్కో రైతు వేదిక నిర్వహణకు నెలకు రూ. 9 వేలు మంజూరు చేయాల్సి ఉంది. 40 నెలలుగా నిర్వహణ నిధులు మంజూరు కాకపోవడంతో రూ.1,11,60,000 పెండింగ్లో ఉన్నాయి. రైతు వేదిక నిర్వహణ తప్పనిసరి కావడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహణకు డబ్బు ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నారు. రైతులకు రైతు వేదికల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉంటూ రైతులకు పంటల సాగుపై సలహాలు సూచనలు అందిస్తూ క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన చేపడుతున్నారు.
పెండింగ్లో రూ.1,11,60,000
ఇబ్బందులు పడుతున్న వ్యవసాయశాఖ అధికారులు
నిర్వహణ భారం
నిర్వహణ భారం


