ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌

Apr 29 2025 12:33 AM | Updated on Apr 29 2025 12:33 AM

ఎస్‌జ

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌

వెంకటాపురం(ఎం): స్కూల్‌ గేమ్స్‌ ఫేడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే బాక్సింగ్‌ టీంకు కోచ్‌గా మండల కేంద్రానికి చెందిన మామిడిపెల్లి రమేశ్‌ ఎంపికయ్యారు. ఈనెల 30నుంచి మే 5 వరకు ఢిల్లీలోని ఛత్రసల్‌ స్టేడియంలో నిర్వహించబోయే 68వ ఎస్‌జీఎఫ్‌ జాతీయ స్థాయి బాక్సింగ్‌ పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొనే అండర్‌–19 బాలికల బాక్సింగ్‌ జట్టుకు కోచ్‌గా రమేశ్‌ వ్యవహరించనున్నారు.

తైక్వాండో పోటీల్లో

కాంస్య పతకం

ఏటూరునాగారం: ఈ నెల 26, 27వ తేదీల్లో హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో ఇండియా, నేపాల్‌ దేశాల మొదటి అంతర్జాతీయ తైక్వాండో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల గిరిజన ఉపాధ్యాయుడు మైపతి సంతోష్‌ పాల్గొని కాంస్య పతకాన్ని సాధించినట్లు జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ కార్యదర్శి, కోచ్‌ మాస్టర్‌ పాయం నేశంత్‌ తెలిపారు. 61కేజీల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకం సాధించడం అభినందనీయన్నారు.

సివిల్‌ కోర్టులో

చలివేంద్రం ప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలో జూనియర్‌ సివిల్‌ కోర్టులో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వలబోజు శ్రీనివాస్‌చారి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో కోర్టుకు వచ్చే ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్‌చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ నాయకులు శ్రవణరావు, రాజ్‌ కుమార్‌, రాకేష్‌, అనిల్‌ పాల్గొన్నారు.

సీసీఎస్‌ కానిస్టేబుల్‌

రాజుకు రివార్డు

భూపాలపల్లి అర్బన్‌: సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ఉప్పుల రాజు డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు రాజు చేసిన కృషికి రివార్డుకు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజును డీజీపీ సన్మానించి రివార్డు అందజేశారు. ఈ సందర్భంగా రాజును ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు.

సివిల్స్‌ ర్యాంకర్‌కు సన్మానం

భూపాలపల్లి అర్బన్‌: వారం రోజుల క్రితం విడుదల అయిన సివిల్స్‌ ఫలితాలలో ప్రతిభ కనబరిచి 85వ ర్యాంకు సాధించిన బానోతు జితేంద్ర నాయక్‌ను సింగరేణి సీఎండీ బలరాం సన్మానించారు. సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జితేంద్ర నాయక్‌ను సీఎండీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారితల్లిదండ్రులను అభినందించారు.

టోకెన్‌ సమ్మెను

విజయవంతం చేయాలి

భూపాలపల్లి అర్బన్‌: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న టోకెన్‌ సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని యూనియన్‌ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించి, పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయని ఆరోపించారు.

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌
1
1/4

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌
2
2/4

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌
3
3/4

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌
4
4/4

ఎస్‌జీఎఫ్‌ జాతీయస్థాయి బాక్సింగ్‌ కోచ్‌గా రమేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement