
ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలి
ములుగు: యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. సన్నబియ్యం సరఫరా, ధాన్యం కొనుగోలుపై శనివారం హైదరాబాద్ నుంచి ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా వేగవంతంగా కొనుగోలు చేపట్టాలని అన్నారు. రైస్మిల్లర్లు తాలు, తరుగు పేరుతో కోతలు విధించకుండా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ టీఎస్ దివాకర, అదనపు కలెక్టర్లు సంపత్రావు, సీహెచ్ మహేందర్జీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మల్లేశం, జిల్లా నీటిపారుదల శాఖ మంత్రి అప్పలనాయుడు, ఈఈ నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి దేవ్రాజ్, జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా ఫైజల్ హుస్సేనీ తదితరులు పాల్గొన్నారు.