
'పాడుతా తీయగా'(Padutha Theeyaga) ప్రోగ్రాంకి క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ ప్రవస్తి ఆరాధ్య(Pravasthi Aradhya) అనే సింగర్ చేసిన ఆరోపణల కారణంగా మాయని మచ్చ ఏర్పడింది. జడ్జిలైన కీరవాణి, చంద్రబోస్, సునీత తనని అన్యాయంగా టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని ఈమె ఆరోపిస్తుంది. ఒకరిపై ఒకరు వీడియోలు చేసుకుంటూ వివరణలు ఇచ్చుకుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇంతకీ ప్రవస్తి ఆరాధ్య ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
(ఇదీ చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి)
ప్రవస్తి బ్యాక్ గ్రౌండ్
పూర్తి పేరు ప్రవస్తి ఆరాధ్య. తెలుగమ్మాయే. ముద్దుగా రైనో అని కూడా పిలుస్తుంటారు. 2006 డిసెంబరు 9న పుట్టింది. అంటే ప్రస్తుతం ఈమె వయసు 19 ఏళ్లు. 2011లో ఐదేళ్లకే పాడటం మొదలుపెట్టింది. సరిగమప లిటిల్ ఛాంప్స్ అనే పోటీలో పాల్గొని విజేతగానూ నిలిచింది.
తెలుగుతో పాటు తమిళ సింగింగ్ రియాలిటీ షోల్లో పాల్గొని ప్రవస్తి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో సూపర్ సింగర్ జూనియర్ 4 తమిళ షోలో పాల్గొని ఫైనల్స్ వరకు వచ్చింది. ఇక గతేడాది తెలుగులో సూపర్ సింగర్ పాటల పోటీలో పాల్గొని విజేతగా నిలిచింది.
(ఇదీ చదవండి: కీరవాణి దగ్గర చాకిరీ.. సింగర్స్ అందరికీ ఇష్టమే: లిప్సిక)
ఇప్పుడే కాదు చిన్నతంలోనూ 'పాడుతా తీయగా' ప్రోగ్రాంలో పాల్గొంది. అప్పటి జడ్జిలైన ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రమణ్యం(SP Balu) నుంచి ప్రశంసలు అందుకుంది. వీళ్లిద్దరి ప్రోత్సాహం వల్లే సంగీత రంగంలో రాణించాలనుకుంది. కానీ తాజాగా పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ షో నుంచి ప్రారంభంలోనే ఎలిమినేట్ అయిపోయింది.
తను బాగానే ఫెర్ఫార్మ్ చేసినప్పటికీ జడ్జిలు కీరవాణి, సునీత(Singer Sunitha), చంద్రబోస్ తనపై వివక్ష చూపించారని, టార్గెట్ చేశారని సంచలన వీడియో రిలీజ్ చేసింది. తన ఇకపై గాయనిగా కొనసాగాలనుకోవట్లేదని కూడా కుండబద్ధలు కొట్టేసింది. మరి నిజంగా ఈ మాటపై నిలబడుతుందా? అసలు ఈ గొడవకు పుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందనేది చూడాలి?
(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)