వరలక్ష‍్మీ కొత్త జర్నీ.. ఒకేసారి మూడు బాధ్యతలు | Varalaxmi Sarath Kumar Directorial Debut With Saraswathi Movie | Sakshi
Sakshi News home page

Varalaxmi Sarath Kumar: హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మరో ప్రయత్నం

Sep 27 2025 9:20 PM | Updated on Sep 27 2025 9:20 PM

Varalaxmi Sarath Kumar Directorial Debut With Saraswathi Movie

తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే నటి వరలక్ష‍్మి శరత్ కుమార్ ఇప్పుడు కొత్త జర్నీ మొదలుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్.. రీసెంట్ టైంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూవీస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా దర్శకురాలిగా, నిర్మాతగా మారిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు కొత్త చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!)

తండ్రి శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వరలక్ష‍్మీ.. 13 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది. దక్షిణాదిలోని అన్ని బాషల్లోనూ నటించింది. ఈ ఏడాది నాలుగు చిత్రాలతో ప్రేక్షకులు ముందుకొచ్చింది. ఇప్పుడు సడన్‌గా 'సరస్వతి' అనే మూవీని ప్రకటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వరలక్ష‍్మీ వ్యవహరించనుంది.

థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో వరలక్ష‍్మీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. తమన్ సంగీతమందిస్తున్నాడు. చెల్లి పూజతో కలిసి వరలక్ష‍్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దోస డైరీస్ పేరుతో నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. గతేడాది నికోలాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు దర్శకనిర్మాతగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చు.

(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్‌ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement