'ఖైదీ' సీక్వెల్‌లో మరో పాన్‌ ఇండియా హీరో | Suriya Enter In Karthi And Lokesh Kanagaraj Khaidi Movie | Sakshi
Sakshi News home page

'ఖైదీ' సీక్వెల్‌లో మరో పాన్‌ ఇండియా హీరో

Nov 3 2024 12:22 PM | Updated on Nov 3 2024 12:45 PM

Suriya Enter In Karthi And Lokesh Kanagaraj Khaidi Movie

కోలీవుడ్‌ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ తన కెరియర్‌లో రెండవ సినిమాగా ఖైదీ విడుదలైంది. నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్స్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఖైదీ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్‌ కనకరాజ్‌ నటుడు కమలహాసన్‌ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్‌ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్‌ పాత్రలో డాన్‌గా మెరిశారు. 

అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్‌, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్‌, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు. దీంతో సూర్య త్వరలోనే ఖైదీ – 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని చెప్పారు. 

అదేవిధంగా దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కూడా వచ్చే ఏడాది ఖైదీ– 2 చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందని ఒక భేటీలో చెప్పారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ నటుడు రజనీకాంత్‌ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ– 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement