
కోలీవుడ్ నటుడు సూరి హీరోగా నటిస్తున్న పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం మామన్ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మండాడి మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్రెడ్ కుమార్ తన ఆర్ఎస్.ఇన్ఫోటెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషం. కాగా ఆయన శిష్యుడు, సెల్షి చిత్రం ఫేమ్ మణిమారన్ పుగళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్ నాయకిగా నటిస్తుంది.
అదేవిధంగా మండాడి చిత్రం ద్వారా తెలుగు నటుడు సుహాస్ ముఖ్య పాత్రతో కోలీవుడ్కు పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాశ్కుమార్ సంగీతాన్ని, ఎస్ఆర్.కదీర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు సూరి మాట్లాడుతూ.. తాను హీరోగా నటిస్తున్న మండాడి చిత్రం ప్రారంభ కార్యక్రమాన్నే ఇంత బ్రహ్మండంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం దర్శకుడు వెట్రిమారన్నే అన్నారు.
తాను ఏమీ లేకుండా వచ్చాననీ, ఇప్పుడు శక్తికి మించే సంపాదించినట్లు చెప్పారు. అందువల్ల ఇకపై నచ్చిన చిత్రాలు చేస్తే చాలన్నారు. సర్వైవల్ అవ్వడానికి భగవంతుడి భాగ్యంతో కళామతల్లి చూసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు సంపాదించింది చాలు.. ఇకనుంచి తన విజయానికి కారణమైన అభిమానులకు తనవంతుగా సాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని ఆయన అన్నారు.