అయానే, అహల్య, షాలినీ ప్రధాన పాత్రలు చేసిన మూవీ 'సింగ్ గీతం'. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు కాగా.. కల్కి, మహానటి మూవీస్ తీసిన నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో డైలాగ్స్ తక్కువగా ఉంటాయి. పాటలే ఎక్కువగా ఉంటాయి. అత్యాశ అనే కాన్సెప్ట్తో దీన్ని తెరకెక్కించారు. గత నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈనెల జూలై 08 నుంచే ఓటీటీ ప్రియులకు నెట్ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది.
తాజాగా ఈ మూవీ నుంచి ఓరి జీవుడా అనే సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ను శంకర్ బాబు ఆలపించగా.. దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ పాట థియేటర్లలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో సాంగ్ మీరు కూడా చూసేయండి.


