ముప్ఫై ఏళ్లు ముందుకు... | Shraddha Srinath next is a horror-thriller Kaliyugam | Sakshi
Sakshi News home page

ముప్ఫై ఏళ్లు ముందుకు...

Nov 7 2020 3:27 AM | Updated on Nov 7 2020 3:27 AM

Shraddha Srinath next is a horror-thriller Kaliyugam - Sakshi

2020 నుంచి ఏకంగా ముప్ఫై ఏళ్లు ముందుకు వెళ్లి 2050లోకి అడుగుపెట్టబోతున్నారు శ్రద్ధా శ్రీనాథ్‌. ఎందుకు అంటే? ఆమె అంగీకరించిన తాజా చిత్రం ‘కలియుగం’ కథ 2050 నేపథ్యంలో సాగుతుంది. ‘జెర్సీ’లో మంచి నటన కనబరచిన శ్రద్ధా ఈ చిత్రకథ వినగానే అంగీకరించారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఆర్‌.కె. ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై కేఎస్‌ రామకృష్ణ నిర్మించనున్నారు. పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రమోద్‌ సుందర్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

 శ్రద్ధా శ్రీనాథ్‌ మాట్లాడుతూ – ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాను. అంత గొప్పగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. ‘‘అద్భుతమైన కథతో హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమా ఉంటుంది. 2021 జనవరిలో షూటింగ్‌ ప్రారంభిస్తాం. 2050 బ్యాక్‌డ్రాప్‌ కాబట్టి సెట్స్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్‌ అసిస్టెంట్‌ రామ్‌చరణ్‌  సినిమాటోగ్రాఫర్‌గా చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement