Sharwanand Aadavallu Meeku Joharlu Movie Press Meet Speech Highlights - Sakshi
Sakshi News home page

Sharwanand: థియేటర్లకు రప్పించే సినిమా ఇది

Published Wed, Feb 16 2022 1:32 AM

Sharwanand Comments On Aadavallu Meeku Joharlu Press Meet - Sakshi

‘‘శతమానం భవతి’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ‘మహానుభావుడు’ వంటి ఎంటర్‌టైనర్‌ చిత్రాల తర్వాత నేను చేసిన ఆ తరహా చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చిరునవ్వుతో, మంచి సినిమా చూశాం అనే అనుభూతితో బయటికొస్తారు. ఈ సినిమాలో రాధిక, ఖుష్బూగార్లతో నటించడం ఆనందంగా ఉంది’’ అని శర్వానంద్‌ అన్నారు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకానుంది.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నేను అనుకున్నంత బాగా రావడానికి కారణమైన శర్వానంద్, రష్మిక, ఖుష్బూ, రాధికగార్లకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కిన చిత్రమిది.. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు రష్మికా మందన్న. ‘‘కరోనా తర్వాత కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’’ అన్నారు నటి రాధికా శరత్‌కుమార్‌. ‘‘కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి ఖుష్బూ సుందర్‌. నిర్మాత సుధాకర్, నటీమణులు ఝాన్సీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్‌ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్‌ సారంగ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్‌. 

Advertisement

తప్పక చదవండి

Advertisement