Ram Charan: రామ్‌ చరణ్‌ ఇంట క్రికెటర్ల సందడి, వైరల్‌గా ఫొటోలు

Ram Charan Invites Indian Cricket Team For Launch After Won Match in Hyderabad - Sakshi

హీరో రామ్‌ చరణ్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఆతిథ్యం ఇచ్చాడు.  హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో నిన్న(ఆదివారం) జరిగిన ఇండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియన్‌ క్రికెట్‌ టీంను అభినందిస్తూ తన నివాసంలో విందు ఏర్పాటు చేశాడు చరణ్‌. ఈ సందర్భంగా ఆల్‌ రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా, సూర్య కుమార్‌ యాదవ్‌తో పాటు పలువురు ఆటగాళ్లు చరణ్‌ ఇంటికి చేరుకుని సందడి చేశారు. 

చదవండి: ఐశ్వర్య, త్రిషల వల్ల చాలా ఇబ్బంది పడ్డా: మణిరత్నం

ఈ సందర్భంగా చరణ్‌ ఆటగాళ్లను సన్మానించి వారితో కాసేపు సరదాగా ముచ్చటించాడు. రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు ఏర్పాటు చేసిన ఈ పార్టీలో మెగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రెటీలు సైతం పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా చరణ్‌ ఇంటిలో పని చేసే ఓ వ్యక్తి హార్థిక్‌ పాండ్యాతో దిగిన ఫొటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ పార్టీ సంబంధించిన ఫొటోలను చిరు త్వరలోనే తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేయనున్నాడని తెలుస్తోంది. 

చదవండి: ఓటీటీకి రంగ రంగ వైభవంగా! దసరాకు స్ట్రీమింగ్‌, ఎక్కడంటే..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top