R. Narayana Murthy: ఆ జీవో జారీ చేసిన జగన్‌కు సెల్యూట్‌

R Narayanamurthy Salutes YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అనంతపురం: పెద్ద సినిమాలకు ఇష్టానుసారంగా టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం లేకుండా కొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సెల్యూట్‌ చేస్తున్నానని సినీ దర్శకుడు, నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఎంతోమంది చిన్న నటీనటుల సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఆ జీవో ఆశాకిరణంగా మారిందన్నారు.

గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆర్‌.నారాయణమూర్తి తాను నిర్మిస్తున్న 'రైతన్న' సినిమా విశేషాలను అక్కడి ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ.. చిత్రపరిశ్రమ మొత్తం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తాను నిర్మించిన రైతన్న చిత్రం ఆగస్టు 15న విడుదలవుతున్నట్లు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top