మోహన్ లాల్ సినిమాకు పైరసీ బెడద.. ఏకంగా టూరిస్ట్ బస్సులోనే! | Mohanlal Thudarum Movie piracy producer Renjith takes legal action | Sakshi
Sakshi News home page

Thudarum Movie: టూరిస్ట్ బస్సులో మోహన్ లాల్ మూవీ.. నిర్మాత ఫిర్యాదు..!

May 6 2025 11:07 AM | Updated on May 6 2025 11:25 AM

Mohanlal Thudarum Movie piracy producer Renjith takes legal action

మలయాళ సూపర్ స్టార్‌ మెహన్ లాల్ నటించిన తాజా చిత్రం 'తుడరుమ్'. ఈ చిత్రంలో శోభన హీరోయిన్‌గా కనిపించింది. మలయాళంలో హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు దాదాపు 15 ఏళ్ల తర్వాత మరోసారి జతకట్టారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్‌ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే వందకోట్లకు పైగా వసూళ్లతో మలయాళ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్ రావడంతో అభమానులు క్యూ కడుతున్నారు.

సినీ ఇండస్ట్రీని ఎప్పటినుంచో పట్టి పీడిస్తోన్న పైరసీ భూతం ఈ సినిమాను వదల్లేదు. గతంలో గేమ్ ఛేంజర్‌ మూవీలాగే ఈ చిత్రాన్ని కూడా ఓ టూరిస్ట్‌ బస్సులో ప్రదర్శించారు. కేరళలోని మలప్పురం నుంచి వాగమోన్‌కు వెళ్తున్న టూరిస్ట్ బస్సులో ఈ మూవీ ‍ప్రదర్శించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలైంది. దీంతో ఈ మూవీ నిర్మాత ఎం రంజిత్‌ లీగల్‌ చర్యలకు సిద్ధమయ్యారు. ఆయన వెంటనే సైబర్ సెల్ ప్రధాన కార్యాలయంలో పోలీసుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ మంత్రి సాజి చెరియన్..  సరైన ఆధారాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా..  ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి తరుణ్‌ మూర్తి దర్శకత్వం వహించారు. ఈ మూవీ విడుదలైన 10 రోజుల్లోపు ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ సక్సెస్‌గా కొనసాగుతోంది. అంతేకాకుకండా ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతకుముందే  మోహన్ లాల్ నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ రూ. 246 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తుడరుమ్.. ఎల్2: ఎంపురాన్, మంజుమ్మెల్ బాయ్స్,  2018 చిత్రాల తర్వాత  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన నాల్గవ మలయాళ చిత్రంగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement