
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషకు చెందిన హీరోలు.. ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటివి ఏం లేని టైంలోనే దేశవ్యాప్తంగా ఫేమ్ సొంతం చేసుకున్న కొందరు నటీనటులు ఉన్నారు. వాళ్లలో మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ ఒకరు. ఈయనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన కట్టడంలో ఓ ఫ్లాట్ ఉందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?
(ఇదీ చదవండి: త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఇలాంటి పరిస్థితా?)
దుబాయిలో బుర్జ్ ఖలీఫా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడికి వెళ్లిన ప్రతి పర్యాటకుడు దీన్ని సందర్శించకుండా తిరిగిరాడు. అలాంటిది ఈ ఎత్తయిన కట్టడంలోని 29వ ఫ్లోర్లో సింగిల్ బెడ్ రూమ్ని చాన్నాళ్ల క్రితమే మోహన్ లాల్ కొనుగోలు చేశారు. దాదాపు రూ.3.5 కోట్లు పెట్టి దీన్ని సొంతం చేసుకున్నారు. కాకపోతే దీన్ని తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించారు. దీనితో పాటు దుబాయిలోనే పెద్ద విల్లాలోని 3 బీహెచ్కే ఫ్లాట్ కూడా మోహన్ లాల్ కొన్నారు.
ఇలా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక నటుడిగా మోహన్ లాల్ రికార్డ్ సృష్టించారనే చెప్పాలి. తెలుగు నటుల్లోనూ మహేశ్ బాబు, అల్లు అర్జున్కి కూడా దుబాయిలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేశారనే గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై క్లారిటీ రావాల్సి ఉంది. గత కొన్నాళ్లుగా చూసుకుంటే మాత్రం దుబాయిలో టూరిజం బాగా పెరిగింది. దీంతో మనదేశానికి చెందిన పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు అక్కడ అపార్ట్ మెంట్స్ కొనుగోలు చేస్తున్నారు.
మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో నటించడంతో ఈ తరం ఆడియెన్స్కి పరిచమయ్యారు. రీసెంట్ టైంలో ఎల్ 2 ఎంపురాన్, తుడరమ్ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈయన కొడుకు ప్రణవ్ కూడా హీరోగా మలయాళంలో పలు చిత్రాలు చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ సినిమా.. తెలుగులోనూ)