Santhanam-Megha Akash: నటుడు సంతానంతో మేఘా ఆకాష్‌ రొమాన్స్‌!

Megha Akash Screen Share With Santhanam in Vadakkupatti Ramasamy - Sakshi

తమిళసినిమా: సంతానంతో రొమాన్స్‌ చేయడానికి నటి మేఘా ఆకాష్‌ సిద్ధమయ్యారు. సంతానం కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వడకుపట్టి రామసామి’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఇంతకుముందు సంతానం హీరోగా డిక్కీలూన అనే చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అదే సంస్థపై ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం వడకుపట్టి రామసామి. కార్తీక్‌ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. నటుడు జాన్‌ విజయ్‌ ఎంఎస్‌ భాస్కర్, రవి మరియ, మొటై రాజేంద్రన్, నిళల్గల్‌ రవి, శేషు, ప్రశాంత్, జాక్విలిన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి శాన్‌ రోల్డెన్‌ సంగీతాన్ని, దీపక్‌ చాయాగ్రహణంను అందిస్తున్నారు. తాజాగా కథానాయకిగా మేఘా ఆకాష్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్‌ సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా మేఘా ఆకాష్‌ను కోలీవుడ్‌లో చూసి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న యాదూమ్‌ ఊరే యావరుమ్‌ కేళీర్, మానై పిడిక్కాద మనిదన్, సింగిల్‌ శంకరుమ్‌ స్మార్ట్‌ పోన్‌ సిమ్రానుమ్‌ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా వడకు పట్టి రామసామి చిత్రంలో ఈమె డాక్టర్‌గా నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోందని చెప్పారు. ఈ చిత్రానికి వివేక్‌ కూచిభట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top