
దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథా కథనాలు అందిస్తూ తెరకెక్కించిన సినిమా 'కుమారి 21 ఎఫ్' (Kumari 21F).. 2015లో విడుదలైన ఈ చిత్రం జులై 10న రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కథ చాలా బలంగా పనిచేసింది. ఆపై దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కీలకంగా మారింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 38 కోట్ల వరకు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాతగా సుకుమార్కు మంచి లాభాలను ఈ చిత్రం తెచ్చిపెట్టింది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం జులై 10న మరోసారి థియేటర్లో విడుదల కానుంది.