breaking news
Kumari 21F movie
-
సుకుమార్ ఫస్ట్ సినిమా 'కుమారి 21F' రీరిలీజ్ (ట్రైలర్)
దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథా కథనాలు అందిస్తూ తెరకెక్కించిన సినిమా 'కుమారి 21 ఎఫ్' (Kumari 21F).. 2015లో విడుదలైన ఈ చిత్రం జులై 10న రీరిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కథ చాలా బలంగా పనిచేసింది. ఆపై దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కీలకంగా మారింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 38 కోట్ల వరకు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాతగా సుకుమార్కు మంచి లాభాలను ఈ చిత్రం తెచ్చిపెట్టింది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం జులై 10న మరోసారి థియేటర్లో విడుదల కానుంది. -
నిఖిల్ తో జోడీ కట్టనున్న 'కుమారి'
చెన్నై: 'కుమారి 21 ఎఫ్' సినిమాతో హిట్ సాధించిన హీరోయిన్ హేబా పటేల్ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. తాజాగా నిఖిల్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ హేబా ఎంపికైంది. ఫస్ట్ హీరోయిన్ గా అవికా గోర్ నటిస్తోంది. మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సివుందని దర్శకుడు ఆనంద్ తెలిపారు. రొమాంటిక్ ఫాంటసీగా తెరకెక్కనున్న ఈ సినిమాను వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. జనవరి 20 నుంచి షూటింగ్ మొదలుకానుంది. కాగా, రాజ్ తరుణ్ తో మరో సినిమాలో నటించేందుకు హేబా పటేల్ ఇప్పటికే అంగీకరించింది. మంచు విష్ణు హీరోగా తనే నిర్మిస్తున్న సినిమాలో సెకండ్ హీరోగా రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్కు జోడీగా తొలుత అవికా గోర్ను తీసుకున్నారు. అయితే కుమారి 21 ఎఫ్ సక్సెస్ తరువాత మనసు మార్చుకున్న చిత్రయూనిట్, అవికా ప్లేస్లో హేబాను సెలెక్ట్ చేశారు.