కోట్ల రూపాయల మోసం కేసులో తమన్నా-కాజల్? | Kajal Aggarwal And Tamannaah Bhatia Involved In Crypto Currency Case | Sakshi
Sakshi News home page

Kajal-Tamannaah: క్రిప్టో సంస్థ మోసం.. విచారణకు హీరోయిన్లు?

Feb 28 2025 10:08 AM | Updated on Feb 28 2025 10:38 AM

Kajal Aggarwal And Tamannaah Bhatia Involved In Crypto Currency Case

సైబర్ నేరాలు కావొచ్చు, ఎక్కువ డబ్బులిస్తామని ఆశపెట్టడం కావొచ్చు.. గత కొన్నేళ్లలో చాలామంది ప్రజలు మోసపోతూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఇలానే క్రిప్టో కరెన్సీ పేరుతో పుదేచ్చేరిలో పలువురు కోట్ల రూపాయల మోసపోయారు. ఇప్పుడీ కేసులో హీరోయిన్లు తమన్నా-కాజల్(Kajal Aggarwal)ని పోలీసులు విచారించబోతున్నారు?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)

ఇంతకీ ఏం జరిగింది?

కోయంబత్తూర్ ప్రధాన కేంద్రంగా క్రిప్టో కరెన్సీ పేరుతో 2022లో ఓ కంపెనీ ప్రారంభించారు. దీనికి తమన్నా(Thamannah Bhatia) తదితరులు హాజరయ్యారు. అనంతరం మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన సంస్థ కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ హాజరైంది. తర్వాత ముంబైలోని క్రూయిజ్ నౌకలో గ్రాండ్ గా పార్టీ నిర్వహించి, పెట్టుబడులు పెట్టేలా ప్రజల్ని ఆకర్షించారు.

ఈ క్రమంలోనే అత్యధిక లాభాల్ని రిటర్న్ ఇస్తామని చెప్పిన క్రిప్టో కరెన్సీ సంస్థ.. పుదుచ్చేరిలో వేలాది మంది నుంచి రూ.3.4 కోట్లు వసూలు చేశారు. ఈ వ్యవహారంలో నితీష్ జైన్, అరవింద్ కుమార్ అనే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)

అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదు మేరకు హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ను కూడా ఈ కేసులో భాగంగా ఇప్పుడు పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

పుదుచ్చేరి సైబర్ క్రైమ్ ఎస్పీ డాక్టర్ బాస్కరన్ మాట్లాడుతూ.. ఈ సంస్థపై ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయినట్టు చెప్పారు. మొత్తంగా రూ.50 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో కోయంబత్తూరు, బెంగళూరు, చెన్నైకు చెందిన కనీసం 10 మందికిపైగా నిందితుల ఉన్నట్టు విచారణలో వెల్లడయ్యిందని వివరించారు.

(ఇదీ చదవండి: సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement