‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరిందని, ఫిబ్రవరి 7న కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్నగర్ టాక్. కల్యాణ్రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తారు. కాగా ఈ సినిమా నేపథ్యం, నటీనటుల గురించిన చర్చలు కూడా ఫిల్మ్నగర్లో జోరందుకున్నాయి.
విజయనగరం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని, ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించే ఈ సినిమాకు పొలిటికల్ టచ్ ఉంటుందని భోగట్టా. ఈ సినిమాలో హీరోయిన్గా ఆలియా భట్ నటిస్తారని, అనిరుద్ మ్యూజిక్ అందించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఫిబ్రవరి చివరి వారంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. అయితే ఈ అంశాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.