Lock Upp Show: ఈ వారం 'లాక్‌డ్‌ అవుట్‌' కంటెస్టెంట్‌ ఎవరంటే ?

Godman Swami Chakrapani Is First Elimination Candidate From Lock Upp - Sakshi

Lock Upp’s First Elimination: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్‌, కాంట్రవర్సీ క్వీన్‌ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న వివాదాస్పద రియాలిటీ షో 'లాక్‌ అప్‌'. 13 మంది కాంట‍్రవర్సీ సెలబ్రిటీలతో నడుస్తోన్నఈ షోకు ఇంతకుముందు చూడనంతా ఉత్సాహం, గొడవలు, మసాలా కంటెంట్‌తో దూసుకుపోతోంది. అయితే ఈసారి ఈ షో నుంచి మొదటిసారిగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌ను ప్రకటించారు మేకర్స్‌. ఈ ఓటీటీ సిరీస్‌ నుంచి గాడ్‌మ్యాన్‌ స్వామి చక్రపాణి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ లాక్‌ అప్‌ షోలో రాజకీయాల, సోషల్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన వివిధ నేపథ్యం ఉన్న వ్యక్తులు పాల్గొంటున్నారు. వీరిలో భారతదేశంలో ఎప్పటినుంచో ఉన్న హిందూ జాతీయవాద సంస్థ అయిన హిందూ మహాసభకు అధ్యక్షుడిగా చెప్పుకునే గాడ్‌మ్యాన్‌ స్వామి చక్రపాణి ఒకరు. 

స్వామి చక్రపాణి ఈ లాక్‌ అప్‌ షోలో టాస్క్‌లు చేస్తున్నప్పుడు తన సహచరులకు ఎలాంటి సహాయం చేసేవాడు కాదట. దీంతో హోస్ట్‌ కంగనా రనౌత్‌, ప్రేక్షకులు మొదటి వారంలోనే ఎలిమినేట్ చేయాలని ఓట్లు వేశారు. చక్రపాణి ఎలిమినేట్‌ అయినట్లు ఓటీటీ సంస్థ ఆల్ట్‌ బాలాజీ చక్రపాణి లాక్‌డ్‌ అవుట్‌ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ షేర్‌ చేసింది. ఇదిలా ఉంటే ఈ షో సమయంలో చక్రపాణి తనను అభ‍్యంతరకరంగా తాకినట్లు సైషా అనే మరో కంటెస్టెంట్‌ తెలిపింది. 'నాతో ఇలా చేయకు. నాకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో ఇలానే చేస్తారా? నేను అమ్మాయిని. ఇది స్నేహం, మరేదైనా ఇలా నాకు ఇష్టం లేదు' అని చెప్పుకొచ్చింది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top