ఉన్నట్టుండి పోస్టులన్నీ డిలీట్‌, ఎందుకబ్బా? | Fans Asking Why Trisha Deletes Old Instagram Posts | Sakshi
Sakshi News home page

ఉన్నట్టుండి పోస్టులన్నీ డిలీట్‌, ఎందుకబ్బా?

Aug 18 2020 1:25 PM | Updated on Aug 18 2020 2:22 PM

Fans Asking Why Trisha Deletes Old Instagram Posts - Sakshi

ఇటీవల నటించిన ‘గిల్లి’ మూవీలోని వీడియోనే ఆమె చివరి పోస్టు.

హీరోయిన్‌  త్రిషా కృష్ణన్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే, ఉన్నట్టుండి ఆమె  తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి చాలా పోస్టులను తొలగించారు. దీంతో ఆమె ఎందుకు పాత పోస్టులను డిలీట్‌ చేశారని అభిమానులు ఆలోచనలో పడ్డారు. కాగా, కొన్ని రోజులు పాటు ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలకు దూరంగా ఉంటాని జూన్‌లో ప్రకటించారు. కానీ, పాత పోస్టులు డిలీట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం త్రిష ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కేవలం ఏడు పోస్టులు కనిపిస్తున్నాయి. ఇళయదళపతి విజయ్‌తో నటించిన ‘గిల్లి’ మూవీలోని  కొన్ని సీన్స్‌తో కూడి వీడియోనే ఆమె చివరి పోస్టు.

పోస్టుల డిలీట్‌ విషయంలో అభిమానులు నిరాశకు గురవగా.. త్రిష మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రిష చివరిగా గౌతమ్ మీనన్‌ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ కనిపించారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ శింబు హీరోగా నటించిన ‘విన్నైతండి వరువాయ’కు సీక్వెల్. అదే విధంగా విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, ‘జయం’ రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చారిత్మ్రాతక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో త్రిష ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తమిళ నవల ‘పొన్నియిన్‌ సెల్వన్‌’  ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కరోనా వల్ల అన్ని సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది.

Dang🔥Loved this😂 #Ghilli

A post shared by Trish (@trishakrishnan) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement