
హీరోయిన్ కీర్తీ సురేశ్ మెయిన్ లీడ్ రోల్లో నటించనున్న కొత్త సినిమాకు ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. అని ఐవీ శశి దర్శకత్వంలో రాధికా లావు ఈ చిత్రం నిర్మిస్తున్నారు.
వసంత్ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు. ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్, సుహాస్ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మహానటితో సినిమా అనగానే సుహాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి కీర్తి అతిథి పాత్రలో కనిపించనుందా? ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.