Bigg Boss Telugu 6: గీతూ టార్గెట్‌ ఆ రెండు జంటలే! సక్సెస్‌ఫుల్‌గా దెబ్బేసిందిగా!

Bigg Boss 6 Telugu: Geetu Royal Swaps Revanth With Shrihan Pair - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 53: గేమ్‌లో ఉన్నా లేకపోయినా ఆటాడాల్సిందేనని డిసైడ్‌ అయిపోయింది గీతూ. అందుకే సంచాలకురాలిగా ఉన్నా కూడా గేమ్‌ పడింది. ఇక్కడ తను ఫేవరిటిజం చూపిస్తూ ఆది ఫేవరిటిజం చూపిస్తున్నాడని అడ్డదిడ్డంగా వాగింది. మరోపక్క చేపల చెరువు టాస్క్‌లో మెరీనా- బాలాదిత్య జంట ఎక్కువ టార్గెట్‌ అయింది. మరి కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ ఎక్కడివరకు వచ్చింది? హౌస్‌లో ఏమేం జరిగిందో ఇప్పుడు చదివేద్దాం..

అప్పటిదాకా ఫెవికాల్‌లా కలిసిపోయిన సూర్య- ఇనయ నామినేషన్స్‌ నుంచి సరిగా మాట్లాడుకోవడమే మానేశారు. పైగా ఇనయ సూర్య మీద కక్ష పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. 'సూర్యకు బుజ్జమ్మ ఉన్నప్పుడు అతడితో క్లోజ్‌ అవడం తప్పనిపించింది. సూర్యను టాప్‌ 5లో ఉండనివ్వకూడదు. అతడు చాలా తప్పులు చేస్తున్నాడు, ఇక వదిలిపెట్టను. ప్రతివారం నామినేట్‌ చేస్తాను. గీతూ కూడా త్వరలోనే వెళ్లిపోతుంది' అంటూ ఏదేదో మాట్లాడింది ఇనయ.

మరోపక్క రేవంత్‌ వల్లే తన గేమ్‌ ఆగిపోయింది అని ఉడికిపోయిన గీతూ అర్ధరాత్రి అతడి చేపలు దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. కానీ వర్కవుట్‌ కాలేదు. ఇక పొద్దున్నే స్విమ్మింగ్‌ పూల్‌లో నల్ల చేప కనిపించడంతో లటుక్కున పట్టుకుని దాచేసుకుంది గీతూ. ఇకపోతే తాను దొంగతనానికి ప్రయత్నించిన విషయాన్ని ఎందుకు అందరికీ చెప్తున్నావని మెరీనా మీద మండిపడింది గీతూ. నువ్వు ఆడవు, ఒకరిని ఆడనివ్వవు అంటూ ఫైర్‌ అయింది. గెలవలేకపోతున్నావు కాబట్టే ఫ్రస్టేట్‌ అవుతున్నావంటూ ఉన్నమాట అనేసింది మెరీనా.

తర్వాత చేపల చెరువు టాస్క్‌ తిరిగి ప్రారంభమైంది. ఈసారి గీతూ, ఆదిలు సంచాలకులుగా వ్యవహరించారు. అయితే చేపలు పడుతుంటే వాటిని క్యాచ్‌ చేసేందుకు ప్రయత్నించింది గీతూ. నువ్వు గేమ్‌ ఆడితే సంచాలకురాలిగా అనర్హత వేటు వేస్తానని హెచ్చరించాడు ఆది. అయినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. తర్వాత పూల్‌లో దిగిన ఫైమాకు గోల్డ్‌ కాయిన్‌ దొరికింది. దీని సాయంతో బిగ్‌బాస్‌ ఇచ్చిన రెండో ఛాలెంజ్‌ షీల్డ్‌ వార్‌ టాస్క్‌లో ఏయే జంటలను ఎంపిక చేయాలనేది ఫైమా జోడీ నిర్ణయిస్తున్నంది. ఫైమా- రాజ్‌.. తమతో పాటు సూర్య- వాసంతి, ఆదిత్య- మెరీనా, శ్రీసత్య- శ్రీహాన్‌ జంటలు పోటీకి దిగుతాయని వెల్లడించారు. ఈ ఛాలెంజ్‌లో సూర్య- వాసంతి టీమ్‌ గెలిచి 15 చేపలు గెలుచుకుంది.

ఫైనల్‌గా చేపల చెరువు టాస్క్‌ ముగిసే సమయానికి శ్రీసత్య- శ్రీహాన్‌ 67, రేవంత్‌- ఇనయ 129, ఫైమా- రాజ్‌ 109, సూర్య- వాసంతి 89, రోహిత్‌- కీర్తి 84, బాలాదిత్య- మెరీనా -37 చేపలు సంపాదించారు. అయితే నల్ల చేప సాయంతో రెండు జంటల చేపలను స్వాప్‌ చేయొచ్చని బిగ్‌బాస్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు. ఇంకే దొరికింది ఛాన్స్‌ అనుకున్న గీతూ పొద్దున దొరికిన బ్లాక్‌ ఫిష్‌ను బయటకు తీసింది. ఫ్రెండ్స్‌ మధ్యలో చిచ్చు పెడ్తానంటూ అందరికంటే ఎక్కువ చేపలు ఉన్న రేవంత్‌- ఇనయ జోడీని శ్రీసత్య- శ్రీహాన్‌తో స్వాప్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రేవంత్‌ జోడీకి 67 చేపలు రాగా శ్రీహాన్‌ జోడీకి 129 చేపలు వచ్చాయి. అందరికంటే తక్కువ చేపలున్న బాలాదిత్య- మెరీనా జంట ఆట నుంచి వైదొలిగారు.

చదవండి: లైగర్‌ వివాదం.. పూరీ డబ్బులెందుకు ఇవ్వాలి?: నిర్మాత
అమ్మ ఆరోగ్యానికి రిస్క్‌, అయినా నాన్న పట్టించుకోలేదు: శ్రీదేవి కూతురు
అంపైర్‌గా ఉండమంటే బ్యాటింగ్‌, ఇలాగైతే తిట్టరా మరి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top