ఓటీటీకి అనుపమ కోర్ట్ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Anupama Parameswaran Latest Movie JSK OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: ఓటీటీకి అనుపమ కోర్ట్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aug 4 2025 10:01 PM | Updated on Aug 5 2025 11:36 AM

Anupama Parameswaran Latest Movie Streaming On This OTT

అనుపమ పరమేశ్వరన్ లీడ్రోల్లో నటించిన చిత్రం 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ మూవీ రిలీజ్‌కు ముందే వివాదానికి దారితీసింది. సినిమా టైటిల్‌లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. తర్వాత జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళగా పేరును మార్చారు. దీంతో సెన్సార్ బోర్డ్విడుదలకు ఓకే చెప్పింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు సురేశ్ గోపి ప్రధాన పాత్రలో నటించారు.

కోర్టు రూమ్ థ్రిల్లర్గా వచ్చిన సినిమా జూలై 17న థియేటర్లలోకి రిలీజైంది. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే విడుదలైన ఈ సినిమా.. ఆగస్టు 15 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.

జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ..

సిటీలో ఉద్యోగం చేసుకునే అమ్మాయి జానకి(అనుపమ). ఓ రోజు ఆమెపై అత్యాచారం జరుగుతుంది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆరోపణలతో ఎదుర్కొంటున్న వ్యక్తి తరఫున వాదించేందుకు లాయర్(సురేశ్ గోపి) వస్తాడు. దీంతో కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరకు జానకికి న్యాయం దక్కిందా లేదా అనేదేఅసలు స్టోరీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement